తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకులు.. 30 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందంటే?

30 ఏళ్ల క్రితం తండ్రిని ఇద్దరు కొడుకులు కలిసి దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోదరుల మీద అనుమానం వచ్చిన మూడో కొడుకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Kadapa Crime : సెల్ ఫోన్ దొంగతనం.. సీనియర్ల నిందకు బలైన విద్యార్థిని..!
New Update

యూపీలో కన్నతండ్రిని చంపి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో 30 ఏళ్ల క్రితం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని హాథ్రస్‌కు చెందిన బుధ సింగ్ 1994లో మిస్ అయ్యాడు. అయితే వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే ఇతనికి నలుగురు కుమారులు ఉన్నారు. ఇటీవల కుమారుల మధ్య గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో మూడో కుమారుడు పంజాబీ సింగ్‌కి 30 ఏళ్ల క్రితం తండ్రికి, అన్నయ్యలకు మధ్య జరిగిన గొడవ గుర్తుకు వచ్చింది.

ఇదే విషయాన్ని సోదరులతో మాట్లాడటంతో ఇద్దరూ అతన్ని బెదిరించారు. అనుమానం వచ్చి పంజాబీ సింగ్ స్థానికంగా ఉన్న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని చంపిది సోదరులే అని, శవాన్ని ఇంటి ఆవరణంలో పాతిపెట్టారని పంజాబీ సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు బుధ సింగ్ ఇంట్లో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో పోలీసులకు ఓ అస్థిపంజరం దొరికడంతో పోస్టుమార్టం చేసి వెంటనే డీఎన్‌ఏ పరీక్షకు పంపించారన్నారు. డీఎన్‌‌ఏ రిపోర్ట్ బట్టి సోదరులపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read :  హైడ్రా హైడ్రొజన్ బాంబులా మారింది: హరీష్ రావు

#killed #uttar-pradesh #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి