Samantha: అవి ఆపండి.. నెటిజన్లకు సమంత సీరియస్ వార్నింగ్!

నటి సమంత నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'సోషల్ మీడియాను వాడొద్దని నేను చెప్పట్లేదు. హద్దులు దాటి ప్రవర్తించేవారు నిపుణులను కలవాలి. సానుకూల స్నేహాన్ని సృష్టించాలి. తప్పుడు ప్రచారాలను మానుకోవాలి' అంటూ కీలక సూచనలు చేసింది.

Samantha: అవి ఆపండి.. నెటిజన్లకు సమంత సీరియస్ వార్నింగ్!
New Update

Samantha Ruth Prabhu: స్టార్ నటి సమంత సోషల్ మీడియా యూజర్లకు కీలక సూచనలు చేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట తెగ యాక్టివ్ గా ఉంటున్న నటి.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాదు ఇటీవల కాస్త బోల్డ్ పిక్స్ పోస్ట్ చేసి ఇంటర్నెట్ ను హీటెక్కించింది. ఈ క్రమంలోనే సామ్ బోల్డ్ షోపై ఫన్నీ కామెంట్స్ పేలాయి. మరికొందరు చాలా వల్గర్ గానూ కామెంట్స్ చేశారు. అయితే వీటన్నింటిని పెద్దగా పట్టించుకోని నటి.. తాజాగా సోషల్ మీడియా విష ప్రచారం గురించి తన మనసులో మాట బయటపెట్టింది.

ఇది కూడా చదవండి: Sai Teja: రాత్రికి వస్తావా? ఎంత తీసుకుంటావ్? ప్రియాంకకు నెటిజన్ షాక్!

తప్పుడు ప్రచారాలను మానుకోవాలి..

ఈ మేరకు సమంత మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాను వాడొద్దని నేను చెప్పట్లేదు. అంతర్జాతీయ అవగాహన కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ హద్దులు దాటి ప్రవర్తించేవారు నిపుణులను కలవాలి. వారినుంచి సలహాలు తీసుకోవాలి. ఆదర్శవంతమైన వ్యక్తులతో మాట్లాడుతుండాలి. సానుకూల స్నేహాన్ని సృష్టించాలి. తప్పుడు కామెంట్లు చేయడం, ఫిర్యాదులు చేయడం, వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అప్పుడే మెదడులో పాజిటివిటీ పెరుగుతుంది' అంటూ చెప్పుకొచ్చింది.

#samantha-ruth-prabhu #samantha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe