Raod Accident: కర్నూలులో రోడ్డు యాక్సిడెంట్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.

New Update
Raod Accident: కర్నూలులో రోడ్డు యాక్సిడెంట్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏడుగురు యువకులు కారులో మంత్రాలయం బయలు దేరారు. కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారు వద్దకు వచ్చే సరికి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

అయితే యువకులకు తీవ్ర గాయాలు కావడంలో మెరుగైన వైద్యం కోసం వారిని బళ్లారికి తరలించారు. సమాచారం అందుకున్న హాలహర్వి మండల పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను ఆలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం యువకుల బంధువులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యువకులు వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు