Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం! అనంతపురం జిల్లా బొందలదిన్నెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రతాప్ రెడ్డి, ప్రమీల, వెంకటలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గంధారగుట్టపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. By srinivas 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని బొందలదిన్నె గ్రామంలో లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు తాడిపత్రి మండలం గంధారగుట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, ప్రమీల, వెంకటలక్ష్మిలుగా పోలీసులు గుర్తించారు. శుభకార్యం నిమిత్తం కడప జిల్లా వేంపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు నిర్దారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-21-at-7.03.41-AM.mp4"> #three-people-died #anantapur #road-accident #car-and-lorry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి