వరంగల్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కారు ఇసుక లారి ఢీ కున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు అక్కడిక్కడే మృతు చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హనుమకొండలోని ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

New Update
వరంగల్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్

Warangal Road Accident: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండలోని ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16) గా గుర్తింపు. గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవి లను చికిత్స కోసం ఎంజీఎం హస్పత్రికి తరలించారు. మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ALSO READ: నేడు భారత్ బంద్… మావోయిస్టుల పిలుపు

Advertisment
తాజా కథనాలు