Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు!
వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి..