Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌లో కేబుల్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైక్‌ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు బ్రిడ్జి పైనుంచి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు.

New Update
Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై వెళ్తున్న ఓ బైక్‌ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు వంతెన పైనుంచి కిందపడి అక్కడకక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కీలక అప్‌డేట్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడ ఫ్లైఓవర్పై వేగంగా వెళ్తున్న బైక్‌ ఫ్లైఓవర్ గోడను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్లో ఉన్న బాల ప్రసన్నగా గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు