BREAKING: కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు.

New Update
BREAKING: కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్!

CM Revanth Reddy Call To Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు (Telangana) రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.

ALSO READ: పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం!

త్వరలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..?

తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను (Om Birla) కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేయడంతో.. త్వరలోనే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై వారితో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని (Nitin Gadkari) కలిసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలవనున్నట్లు సమాచారం.


ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు