Mangoes: భోజనంతో పాటు మామిడిపండ్లు తింటున్నారా..?. ఇవి గుర్తుంచుకోండి..!!

వేసవి సీజన్‌లో పండిన మామిడిపండ్లు తింటే శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. కానీ ఈ పండు తినేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్తలు తెలుసుకుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి!

Mangoes: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో అజాగ్రత్త కూడా అనేక సమస్యలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మామిడికాయల సీజన్ వచ్చింది. ఈ సీజన్‌లో పండిన మామిడిపండ్లు తినడానికి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిని తినేందుకు కొందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మామిడి చాలా ప్రయోజనకరమైన పండు. శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లతో సహా అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే.. మామిడి పండు తినేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా విషం వచ్చే ప్రమాదం ఉందటున్నారు. మార్కెట్ నుంచి మామిడిని కొనుగోలు చేసినప్పుడు.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడిపండు తినకుండా జాగ్రత్త వహించండి:

  • మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి. అయితే.. దీనిని తినడంలో అజాగ్రత్త ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే ఏదైనా పండ్లు ఆరోగ్యానికి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. వాస్తవానికి.. మార్కెట్‌లో లభించే పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ మానవ శరీరానికి ప్రమాదకరమైన రసాయనం.
  •  పండ్లను పండించడంలో కాల్షియం కార్బైడ్ వాడకం ఇటీవలి పెరిగింది. దీని కారణంగా.. అనేక వ్యాధులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కాల్షియం కార్బైడ్‌ను నీటిలో కలిపినప్పుడు.. ఎసిటిలీన్ వాయువు విడుదలవుతుంది.. ఇది పండ్లను పండించడానికి ఉపయోగిస్తారు. కాల్షియం కార్బైడ్, ఎసిటిలీన్ వాయువు రెండూ ఆరోగ్యానికి ప్రమాదకరమని అనేక పరిశోధనలు తేలింది.
  • పండ్ల ఉత్పత్తి పరిశ్రమలో పనిచేసే కార్మికులు కాల్షియం కార్బైడ్‌కు ఎక్కువగా గురికావడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వారు పల్మనరీ ఎడెమా, అంటే ఊపిరితిత్తులలో ద్రవం చేరడం, కార్డియాక్ అరెస్ట్, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడవచ్చు.
  • కాల్షియం కార్బైడ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఏదైనా పండును తినడానికి ముందు కనీసం అరగంట పాటు నీటిలో ఉంచి సరిగ్గా శుభ్రం చేసుకోని తినాలని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  పుచ్చకాయను ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు