Jio: భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్‌.. జియో ప్లాట్‌ఫారమ్‌కు గ్రీన్ సిగ్నల్!

ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది.

New Update
Jio: భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్‌.. జియో ప్లాట్‌ఫారమ్‌కు గ్రీన్ సిగ్నల్!

JIO To Launch Satellite Internet: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది.

అమెజాన్, ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ప్రయత్నాలతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు జియో ప్లాట్‌ఫారమ్‌ కూడా పోటీలో ఉంది. ఈ మేరకు ఆర్బిట్ కనెక్ట్ ఇండియాకు మూడు అనుమతులు మంజూరు చేయబడ్డట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అందులో జియో ఒకటిగా పేర్కొన్నారు. ఏప్రిల్, జూన్‌లలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) ఈ అనుమతులు జారీ చేయగా.. ఆర్బిట్ కనెక్ట్స్ ఉపగ్రహాలను భారతదేశం పైన ఉంచడానికి అనుమతిస్తాయి. ఇది ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

Also Read: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ వివరాలు మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు