Red Sandalwood : మరోసారి రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌పై దారుణం

ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతి సమీపంలోని చింతలపాలెం అటవీ తనిఖీ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రభాకర్‌రావును కారుతో ఢీకొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Red Sandalwood : మరోసారి రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌పై దారుణం
New Update

Tirupati : ఎర్రచందనం(Red Sandalwood) స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే ఓ పోలీస్ కానిస్టేబుల్ ను లారీతో గుద్ది చంపిన ఘటన మరువకముందే మరో కానిస్టేబుల్ పై దారుణానికి పాల్పడ్డారు. తమ దందాకు అడ్డు చెప్పాడని అతన్ని హతం చేసేందుకు కుట్ర పన్ని దారుణంగా గాయపరిచారు. కారుతో గుద్ది గాయాలపాలు చేశారు. ఈ భయంకరమైన సంఘటన ఏపీ(AP) లోని తిరుపతి(Tirupati) ఏర్పేడు సమీపంలో చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి : Rythu Runa Mafi: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్

తనిఖీ చేస్తుండగా..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని చింతలపాలెం అటవీ తనిఖీ కేంద్రం వద్ద ఈ దారుణం జరిగింది. అటవి ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌(Task Force Constable) ప్రభాకర్‌రావు, ఎఫ్‌బీవో హేమావతి, వాచర్‌ కె.సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏర్పేడు వైపు వెళ్తున్న కారును తనిఖీ చేసేందుకు ఆపాలని కోరారు. కానీ స్మగ్లరు కారు ఆపకుండా ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో ప్రభాకర్‌రావు వారి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్ రావు(Prabhakar Rao) ను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, బాధితులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టమని పోలీసు అధికారులు తెలిపారు.

#accident #tirupati #red-sandalwood-smugglers #constable-prabhakar-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe