RS.1000 Note: మళ్ళీ వేయి రూపాయల నోటు.. క్లారిటీ ఇచ్చిన RBI..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1000 రూపాయల నోట్లను మళ్లీ విడుదల చేస్తుందా? నోట్ల రద్దు సమయంలో వెయ్యి రూపాయల నోటును శాశ్వతంగా రద్దుచేసింది. ఆ స్థానంలో 2వేల నోటును తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 2వేల నోటును కూడా రద్దు చేసింది ఇప్పుడు కొత్తగా ఓ ప్రచారం షురూ అయ్యింది. RBI మళ్లీ రూ. 1000 నోటును విడుదల చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

New Update
ICICI, Kotak బ్యాంకులకు RBI షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే?

వెయ్యి రూపాయల నోటు మళ్లీ రానుందా? నోట్ల రద్దు సమయంలో వెయ్యిరూపాయల నోటును తొలగించింది ఆర్బీఐ. ఆ స్థానంలో 2వేల నోటును తీసుకొచ్చింది. ఇప్పుడు అది కూడా రద్దయ్యింది. అయితే తాజాగా ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. వెయ్యి రూపాయల నోటు వస్తుందని ప్రచారం షురూ అయ్యింది. అయితే ఇందులో నిజమెంత? ఎందుకు ఇలా ప్రచారం జరుగుతోంది? ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైంది? ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుుసుకుందాం.

ఇది కూడా చదవండి:  ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!

2వేల నోటును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వేళ వెయ్యిరూపాయల నోటు మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయంపై ఓ వార్త కూడా తెగ వైరల్ అవుతోంది. ఆర్బీఐ వెయ్యి రూపాయల నోటును మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆ వార్త సారాంశం. వెయ్యి రూపాయల నోటును మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్బీఐ పరిగణలోనికి తీసుకోలేదని పలు రిపోర్టులు సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన!

ఇక ఈ ఏడాది మే 19న 2వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నోట్ల మార్పిడికి దాదాపు 4 నెలల గడువు కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే ప్రస్తుతం రూ.1000 కరెన్సీ నోటును ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.

Advertisment
తాజా కథనాలు