Margadarsi case: మార్గదర్శి చీటింగ్ కేసులో హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన రామోజీ & శైలజా

మార్గదర్శి చీటింగ్ కేసు లో సీఐడీ తన మీద వేసిన కేసు కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హై కోర్టు లో లంచ్ మోషన్ వేసారు. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశ ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణ జస్టిస్ సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళగా ఆయన దానిని చేయలేనని చెప్పడంతో వేరే బెంచ్‌కు కేటాయిస్తారని తెలుస్తోంది.

New Update
Margadarshi CID Case: మార్గదర్శి క్వాష్ పిటిషన్ 8 వారాలకు వాయిదా

Margadarsi Chit Fund Case Scam: మార్గదర్శి సహ వ్యవస్థాపకులు జేజీ రెడ్డి వారసుల మూలధన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వాటాల బదలాయింపు వ్యవహారంలో సీఐడీ (CID) తనపై నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ ఈనాడు అధిపతి రామోజీరావు (Ramoji Rao), చెరుకూరి శైలజలు (Shailaja) ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు హైకోర్టులో సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళింది. అయితే ఆయన తాను విచారణ చేయలేనని చెప్పడంతో ఇప్పుడు దాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ కేసును కోర్టు రేపు విచారించే అవకాశ ఉంది.

Also Read:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా?

మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఏపీ సీఐడీ (AP CID) కేసు నమోదు చేసింది. మార్గదర్శిలతో తమకు రావాల్సిన వాటా గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదలో గాదిరెడ్డి యూరిరెడ్డి, పేర్కొన్నారు. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి కొడుకు యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారనిగతంలో షేర్ల గురించి అడుగుతే బెదిరించారని ఫిర్యాదు తెలిపారు. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది. 

Also Read:సరిహద్దులో ఇజ్రాయెల్ సేనలు-గాజాలో ఉద్రిక్త వాతావరణం

Advertisment
తాజా కథనాలు