/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/charan1-jpg.webp)
ప్రస్తుతం ముంబైలో ఉన్న రామ్ చరణ్ తో రాజ్ కుమార్ స్టోరీ డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ చరణ్ కి వినిపించారంట. ఆ స్టోరీ లైన్ చరణ్ కి నచ్చిందని, ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ బిటౌన్ లో నడుస్తోంది. ఈ న్యూస్ మాత్రం నిజమైతే కచ్చితంగా ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. రాజ్ కుమార్ సినిమాలన్నీ సెన్సిబుల్ గా ఉంటాయి. హీరోయిజాలకు దూరంగా ఉంటూ సామాజిక సమస్యల మీద సెటైరికల్ గా ఫైట్ చేసే ఒక సామాన్యుడి తరహాలోనే హీరో క్యారెక్టర్ ఉంటుంది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా డుంకీ సినిమా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విడుదల తర్వాత రాజ్ కుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేయాలని ఆలోచిస్తున్నారని టాక్ మొదలైంది. ఇక చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శాకత్వంలో రామ్ చరణ్ మూవీని సెట్స్ పైకితీసుకొని వెళ్లబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో బుచ్చిబాబు మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో మైత్రీ మూవీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Exclusive : First Time Collaboration#RamCharan - #RajkumarHirani,
Story Discussions Are Happening in Mumbai, Official Announcement Coming Soon ! This is Huge Film. #ManOfMassesRamCharan️ pic.twitter.com/wudwRPiVRB— Vishwajit Patil (@_VishwajitPatil) October 5, 2023
also read:బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్.. ఈ ఏడుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ..