Ram Mandir Latest Updates: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ తేదీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామాలయాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీరామ జనమభూమి తీర్థ క్షేత్ర(Shri Ram Janmbhoomi Teerth Kshetra) ప్రతినిథులు చెబుతున్నారు. ఆ రోజునే గర్భగుడిలో రాంలల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. అయోధ్య(Ayodhya)లో జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాంలల్లా ప్రాణ ప్రతిష్టకు వారం రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభమవుతాయని శ్రీరామ జనమభూమి తీర్థ క్షేత్ర ప్రతినిథులు తెలిపారు. అయితే, రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయ్యింది.
పూర్తిగా చదవండి..Ram Mandir: రామ మందిరంపై బిగ్ అప్డేట్.. ఓపెనింగ్ డేట్ ఇదే..
అయోధ్య నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా సిద్ధమైంది. గర్భగుడి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
Translate this News: