Charan-Upasana : మహారాష్ట్ర సీఎంని కలిసిన చరణ్‌ దంపతులు

చరణ్‌ ఉపాసన దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండేను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి అతిథ్యం ఎంతో బాగుందని ఉపాసన కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

Charan-Upasana : మహారాష్ట్ర సీఎంని కలిసిన చరణ్‌ దంపతులు
New Update

Charan-Upasana Meets Eknath Shinde : రామ్‌ చరణ్‌(Ram Charan) ఉపాసన(Upasana) దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్‌ షిండే(Eknath Shinde) ను కలిశారు. గురువారం నాడు వారి కుమార్తె క్లీంకార కోసం ముంబయిలోని మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరు శుక్రవారం మంత్రి శ్రీకాంత్‌షిండేను, ఆయన తండ్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన చరణ్‌ దంపతులకు శ్రీకాంత్‌ షిండే దంపతులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. శ్రీకాంత్‌ షిండే భార్య వృషాలి ఉపాసనకు కుంకుమ పెట్టి హారతినిచ్చారు. అనంతరం చరణ్‌ ఉపాసన షిండే కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఏక్‌ నాథ్‌ చరణ్‌కి వినాయక విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు.

చరణ్‌ కూడా వారితో సమావేశం ఎంతో సంతోషంగా జరిగిందని వివరించారు. ఈ విషయం గురించి ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. షిండే కుటుంబం ఇచ్చిన అతిథ్యం ఎంతో బాగుందని తెలిపారు. వారి కుటుంబ సభ్యుల ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు.

Also read: చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

#eknath-shinde #maharashtra #charan #upasana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe