Railway Budget: బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేలకు స్థూల బడ్జెట్ మద్దతుగా రూ. 2,52,200 కోట్లు కేటాయించారు. దానితో పాటు అదనపు బడ్జెట్ వనరుల నుండి అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించారు. దీంతో పాటూ ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్ ఇంకా హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్తో సహా మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్లు భారతదేశంలో వస్తాయని ఆమె ప్రకటించారు. ఇక వందే భారత్ , వందే మెట్రో లాంటి కొత్త ట్రైన్స్, ముంబయ్-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, నమో భారత్ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.
పూర్తిగా చదవండి..budget 2024: బడ్జెట్ తర్వాత పడిపోయిన రైల్వే స్టాక్స్..
పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత RVNL, IRFC, Ircon International, RailTel Corporation of India, Texmaco Rail & Engineeringవంటి రైల్వే స్టాక్లు దాదాపు 1-5 శాతం పడిపోయాయి.
Translate this News: