Puja Khedkar: వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల కోసం మహారాష్ట్రలోని పుణె పోలీసులు గాలిస్తున్నారు. ఓ భూ వివాదం వ్యవహారంలో ఆమె తల్లి మనోరమ కొందరిని పిస్టోల్తో బెదిరించిన వీడియో వైరల్గా మారింది. దీంతో పూజా తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం బానేర్ ప్రాంతంలో మనోరమ, దిలీప్ ఖేడ్కర్ నివాసానికి వెళ్లారు. లోపలి తలుపులు లాక్ చేసి ఉన్నట్లు గుర్తించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో పుణె, ఇతర ప్రాంతాల్లో వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Puja Khedkar: దోషిగా నిరూపించేవరకు నేను నిర్దోషినే- పూజా ఖేద్కర్
ఫుల్ కాంట్రవర్శీల్లో ఇరుక్కున్న ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మొదటిసారి మీడియాతో మాట్లడారు. దోషిగా తేలంత వరకు అందరూ నిర్దోషులేనని...మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని ఆమె అన్నారు. మరోవైపు పూజా తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Translate this News: