Crime News : కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ఆరు నెలల కడుపుతో ఉన్న తన భార్యను మంచానికి కట్టేసి, నిప్పటించడం కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

New Update
Crime News : కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త

Punjab : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ఆరు నెలల కడుపు(Pregnant) తో ఉన్న తన భార్య(Wife) ను మంచానికి కట్టేసి, నిప్పటించడం కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుల్డ్‌ నంగల్ అనే గ్రామంలో సుఖ్‌దేవ్ - పింకి అనే దంపతులు ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం రోజున ఈ గోడవలు మరింత ఎక్కువయ్యాయి.

Also Read: సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్..అతనికి సంబంధం లేదు

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సుఖ్‌దేవ్.. ఆరు నెలల కడుపుతో ఉన్న తన భార్యను ఓ మంచానికి కట్టేశాడు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించాడు. దీంతో ఆ మంటల్లో ఆమె అక్కి్కక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్కడున్న స్థానికులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు సుఖ్‌దేవ్‌ పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్(National Women Commission) కూడా స్పందించింది. మూడు రోజుల్లోగా నిందితుడిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.

Also Read: మాధవీలతకు బీజేపీ బిగ్‌ షాక్‌.. నో బీఫామ్ ?

Advertisment
తాజా కథనాలు