నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు

ఆస్తికోసం నమ్మిన స్నేహితుడి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చిన భయంకరమైన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ ఇంటిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ ఒక్కొక్కరిగా 6గురిని చంపేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు
New Update

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఆస్తికోసం నమ్మిన స్నేహితుడినే దారుణంగా మోసం చేశాడు ఓ యువకుడు. ఇంటిమీద లోన్ ఇప్పిస్తానని నమ్మించి నట్టేటా ముంచేశాడు. అంతటితో ఆగకుండా ఆ ప్రాపర్టీ తనే దక్కించుకోవాలనే అత్యాశతో ఫ్రెండ్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి పట్టుమని పాతికేళ్లు కూడా లేకపోగా ఇందుకు సంబంధించిన వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఈ మేరకు నిజమాబాద్ సదాశివ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లుర్ కు నుంచి కొంతకాలం క్రితం మాచారెడ్డికి వలస వచ్చిన ప్రసాద్ ఫ్యామిలీ ఇక్కడే స్థిరపడింది. అయితే ప్రసాద్ కు మాక్లుర్ లో సొంత ఇళ్లు ఉంది. అయితే ప్రసాద్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిన మాక్లుర్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ (20 ఏళ్లు) ఆ ఇంటిపై కన్నేశాడు. ప్రసాద్ కు ఆర్థిక అవసరాలను గుర్తించిన ప్రశాంత్ లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ ఇంటిని తన పేరుపై ప్రశాంత్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే లోన్ రాకపోవడంతో కొన్నాళ్లు వెయిట్ చేసిన ప్రసాద్.. తన ఇంటిని తిరిగి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. అయితే ఎలాగైనా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ కొంతకాలం వాయిదావేస్తూ వచ్చాడు. అయితే ప్రసాద్ మరింత ఒత్తిడి చేయడంతో ఎలాగైన వదిలించుకోవాలని ప్లాన్ చేసిన ప్రశాంత్.. నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రసాద్ ను హతమార్చాడు. అయితే ప్రసాద్ కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

ఇది కూడా చదవండి : సీఎం రేవంత్ కు ఫస్ట్ షాక్.. రేపటి నుంచి వారి సమ్మె!

ఈ క్రమంలోనే ఒక రోజు తర్వాత ప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రశాంత్.. ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆయన భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆమె డెబ్ బాడీని బాసర నదిలో వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికొచ్చాడు. అయితే ఇదే అదనుగా భావించిన ప్రశాంత్.. ఒక్కొక్కరిగా అందరినీ హత్య చేసేందుకు ప్లాన్ చేసి తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని చంపేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల ప్రాణం తీశాడు. అయితే మొదటి మూడు హత్యలు ఒక్కడే చేయగా.. మిగిలిన మూడు మరో ముగ్గురి సహాయంతో చేశాడు. చనిపోయిన వారందరూ ఒకే ఫ్యామిలీ కావడంతో ఎవరూ మిస్సింగ్ కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇక డిచ్‌పల్లి హైవే దగ్గర ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రశాంత్ సదాశివనగర్‌లో ప్రసాద్‌ చెల్లి మృతదేహన్ని పాతిపెట్టాడు. బాసర గోదావరి నదిలో ప్రసాద్‌ భార్య డెడ్‌బాడీని పడేయగా.. బాల్కొండ సొన్ బ్రిడ్జి సమీపంలో ప్రసాద్‌ ఇద్దరు పిల్లల మృతదేహాలున్నాయి. మాచారెడ్డిలో ప్రసాద్‌ మరో చెల్లి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.

#prashant #property #prasad #nizamabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి