Telangana:ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్..మరి కాసేపట్లో ప్రజాదర్బార్

ప్రగతి భవన్...ప్రజా భవన్ అయింది. ఇక మీదట ఇది అన్ని రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఇవాళ పదిగంటలకు జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

New Update
Telangana:ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్..మరి కాసేపట్లో ప్రజాదర్బార్

Praja Darbar by CM Revanth Reddy: ముళ్ళకంచె తొలిగింది. ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్ ఇప్పుడు అందరిదీ అయింది. నిన్న అనౌన్స్ చేసినట్టుగానే మరికొద్ది సేపటిలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలే భవన్ (Jyotirao Phule Bhavan) లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. దశాబ్దం తర్వాత సామాన్యుడు అందులోకి అడుగుపెట్టనున్నాడు. నేడు ప్రజాభవన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలను సీఎం రేవంత్ స్వయంగా పరిష్కరిస్తారు.

Also read:నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!

ఒకవైపు రేవంత్ ప్రమాణస్వీకారం, మరోవైపు ముఖ్యమంత్రి అధికార నివాసం ముందున్న కంచె తొలగింపు ఒకేసారి జరిగిపోయాయి. ప్రగతి భవన్‌ పేరును ప్రజాభవన్‌గా మారుస్తామని రేవంత్‌ ప్రకటించారు. ప్రజా భవన్‌కు (Praja Bhavan) ఎవరైనా రావచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నామని..దాన్ని ప్రజలందరూ నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఉదయం పూట నేరుగా ప్రజలను కలుస్తుండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇది విజయవంతంగా నడిచింది.ఇప్పుడు రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారు. అపాయింట్ మెంట్ లేకుండానే ఎవరైనా నేరుగా ప్రజా భవన్ కు వచ్చి తమ సమస్యలను పేపర్ మీద రాసి ఇవ్వచ్చునని...ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయని రేవంత్ తెలిపారు.

మరి రేవంత్ ఈ ప్రజా దర్బార్ ని ఎంత కాలం కొనసాగిస్తారు...ప్రజా సమస్యలను ఎంత వరకు తీరుస్తారు? అసలు ఇవాళ జ్యోతిరావు పూలే భవన్ లో ఏం చేయనున్నారు అనేది తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.

Advertisment
తాజా కథనాలు