/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
BJP: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది. సోమవారం నామినేషన్లు స్వీకరించి, జులై 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటన రిలీజ్ చేసింది. పదవికి పోటీ పడుతోన్న అశావహుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు.0 జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజున అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
నలుగురు పోటీ..
బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో పోటీ నెలకొంది. ఢిల్లీ వేదికగా లాబీయింగ్ నడుస్తోంది. ముఖ్యంగా నలుగురు పోటీలో ఉన్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్రావు, ధర్మపురి అర్వింద్ అధ్యక్షుడి పీఠకోసం ఆశిస్తున్నారు. కానీ పార్టీకి ఊపు తెచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి తిరిగి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంటోంది.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సైతం విజయబావుటా ఎగురవేస్తామన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది సభ్యులతో కొనసాగుతోన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.