PM Modi : సీజేఐ ఇంట గణపతి పూజ… పాల్గొన్న ప్రధాని మోదీ!

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజ లో మోదీ మహారాష్ట్ర సంప్రదాయంలో కనిపించారు.

author-image
By Bhavana
New Update
modi-ganapti puja

PM Modi :

దేశంలో ప్రస్తుతం గణేశ్‌ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్న ఫొటోలను మోదీ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. 

ఆ విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు. తమ ఇంటికి వచ్చని ప్రధానికి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రబూడ్‌, ఆయన భార్య కల్పనాదాస్‌ సాదర స్వాగతం పలికారు.

Also Read :  Malaika Arora: తీరని దుఃఖంలో మలైకా.. నాన్నతో దిగిన ఫొటోలు వైరల్..!

 

Advertisment
తాజా కథనాలు