Andhra Pradesh: మండపేటలో రాత్రి నుంచి కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం..

ఏపీలోని మండపేట నియోజవర్గంలో ఎమ్మెల్సీ తోట తన కొడుకు వాహనంలో వెళ్తుండగా జనసేనా ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున లీలాకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.

Andhra Pradesh: మండపేటలో రాత్రి నుంచి కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం..
New Update

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజవర్గంలో రాత్రి నుంచి ఆందోళనలు నెలకొన్నాయి. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో ఎమ్మెల్సీ తోట తన కొడుకు వాహనంలో వెళ్తుండగా జనసేనా ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది.

Also Read: ఏపీలో 78.36 శాతం పోలింగ్

వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు.. మంగళవారం తెల్లవారుజామున లీలాకృష్ణను పోలీసులు అరెస్టు చేసి రామచంద్రాపురం నియోజకవర్గం పామర్రు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు పామర్రు పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Also read: చంద్రగిరి కూచివారిపల్లిలో ఘర్షణలు

#andhra-pradesh #telugu-news #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe