Pithapuram : నిన్న రాత్రి పిఠాపురం(Pithapuram) లో దొరికిన బొలేరో వాహనాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇందులో వైసీపీ(YCP) కి సంబంధించిన ఎన్నికల ప్రచార సామాగ్రి భారీగా ఉండడంతో వాభనాన్ని వెంటనే సీజ్ చేశారు. కాకినాడ(Kakinada) నుంచి తునివైపుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వాహనం ప్రయాణిస్తోందని పోలీసులు అంటున్నారు. వ్యాన్లో ప్రచార సామాగ్రి(Promotional Materials) తో పాటూ డమ్మీ ఈవీఎం(Duplicate EVM’s) లు కూడా ఉండడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఇంకా ఇందులో భారీ మొత్తంలో జగన్ మాస్కులు, టోపీలు, జెండాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాన్ని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు అధికారులు తరలించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత
నిన్న అర్ధరాత్రి కాకినాడ జిల్లా పిఠాపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపుకు వెళుతున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. ఇందులో భారీగా ఎన్నికల ప్రచార సామాగ్రిని పట్టుకున్నారు.
Translate this News: