Andhra Pradesh : విజయవాడ డాక్టర్ ఫ్యామిలీ మృతిలో విస్తుపోయే నిజాలు..

విజయవాడలోని ఓ డాక్టర్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలు రావడంతోనే డా.శ్రీనివాస్.. భార్య, పిల్లలు, తల్లి గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత బయటకి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక నిర్థారణలో తేలింది.

New Update
AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.!

Doctor Family : విజయవాడ(Vijayawada) లోని గురునానక్ నగర్‌లోని ఓ డాక్టర్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. డా. డీ. శ్రీనివాస్(Dr. D Srinivas)  మృతదేహం ఇంటి బయట కనిపించగా.. ఇంటి లోపల అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. డా.శ్రీనివాస్ ఆర్థికంగా నష్టపోవడంతో.. తానే కుటుంబ సభ్యులను హత్య చేసి సూసైడ్(Suicide) చేసుకుని ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

Also read: మొబైల్ ఇవ్వనందుకు దారుణ హత్య..

శ్రీనివాస్.. శ్రీజ అనే పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. కానీ అతనికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఈ విషయాలు ఎప్పుడూ కూడా బయటకు చెప్పలేదు. ఆర్థిక సమస్యలు(Financial Problems) ఎక్కువ కావడంతో.. ప్లాన్ ప్రకారమే తన ఇంట్లో వేరు వేరు గదుల్లో నలుగురి గొంతు కోసి హత్య చేశాడు. ఒక గదిలో భార్య ఉషారాణి, కూతురు ఉంది. ఇంకో గదిలో కొడుకు శ్రీహన్ ఉన్నాడు. మరో గదిలో తల్లి రమణమ్మ ఉంది. వీళ్లందరిని కూడా హత్య చేసి.. ఆ తర్వాత బయటకు వచ్చి తాను ఉరేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

Also Read: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. షర్మిల ఆడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు