AP Higher Education Department: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం శాఖల అధికారుల మార్పుపై దృష్టి సారింది. ఇంతకు ముందు ఉన్నవారు సెలవులపై వెళ్ళడం, బదీలీలు అవడంతో ఆ స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తోంది గవర్నమెంట్. ఇప్పటివరకు ఏపీ ఉన్నత విద్యాశాఖాధికారిగా ఉన్న జె.శ్యామలరావును టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఖాళీ అయిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పదవిలో పోలా భాస్కర్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్..
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్ను నియమిస్తూ ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించింది.
Translate this News: