POK: శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్ సైన్యం.. దుశ్చర్యను నిలువరించాలంటూ పీఎంవోకు శారదా కమిటీ లేఖ

కశ్మీరీ పండిట్లు అత్యంత పవిత్రంగా భావించే శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్ సైన్యం భావిస్తోంది. ఈ పీఠం ముజఫరాబాద్‌ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది.

POK: శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్ సైన్యం.. దుశ్చర్యను నిలువరించాలంటూ పీఎంవోకు శారదా కమిటీ లేఖ
New Update

POK: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని సరస్వతీ దేవి పురాతన ఆలయం శారదా పీఠం పాక్‌ సైన్యం ఆధీనంలోకి వెళ్లింది. నియంత్రణ రేఖ సమీపంలో నీలం నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం స్థానంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్‌ సైన్యం భావిస్తోంది. కశ్మీరీ పండిట్లు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే, ఎంతో పవిత్రంగా భావించే ఈ పీఠం ముజఫరాబాద్‌ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని శారదా కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిట్‌ కోరారు. ఈ అంశమై ఈ నెల 1న పీఎంవోకు లేఖ అందింది.

ఇది కూడా చదవండి: J&K: విహార యాత్రలో విషాదం.. కారు లోయలో పడి…

పాక్‌ సైన్యం దుశ్చర్యపై జమ్మూ కశ్మీర్‌లోని భక్తులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. శారదా పీఠం కాంప్లెక్స్‌లోని చాలా కెనాల్స్‌ రూపురేఖలు ఇప్పటికే మారిపోగా, పాక్ సైన్యం చొరబాటుకు ప్రయత్నిస్తోంది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు, మతపరమైన దాడులు, విదేశీ దండయాత్రల ఫలితంగా శారదా శక్తి పీఠం శిథిలమవుతూ వచ్చింది. తాజాగా పాక్‌ దుందుడుకు చర్యలను అడ్డుకోవాలంటూ దారా షికో ఫౌండేషన్ ఇటీవల యునెస్కోకు కూడా లేఖ రాసింది.

#pok #jammu-kashmir-news #sharada-peetham
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe