Andhra Pradesh: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. By B Aravind 25 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈడుపుగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో మాండవ వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. Also Read: ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి ! దీంతో వాళ్లు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ మురళికృష్ణ, ఎస్ఐ సందీప్లు విచారణ జరిపి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ఇదిలాఉండగా ప్రస్తుతం మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కూడా ఇవి ఆగడం లేదు. Also read: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన #pocso #telugu-news #sexual-assault #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి