Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్కుమార్రావుకు హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా శ్రవణ్ కుమార్ లండన్లో ఉన్నారు. ఈ కేసులో వీరు ముందస్తు ప్లాన్లో భాగంగానే విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరిని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు తొలుత లుక్ ఔట్ నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్కుమార్రావుకు హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. విదేశీ దర్యాప్తు సంస్థల సహకారంతో ప్రభాకర్రావు, శ్రవణ్ను అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: