నీ ప్రసంగాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు: పేర్ని నాని!

పవన్‌ తన ప్రసంగాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్న సరే ఏమి పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. హడావిడిగా ప్రజల్లోకి రావడం.. ఏదోకటి ఊగిపోతూ మాట్లాడటం ఆయనకు అలవాటు అయిపోయిందంటూ పేర్ని పవన్ కు చురకలంటించారు.

New Update
AP: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు!

పవన్‌ తన ప్రసంగాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్న సరే ఏమి పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. హడావిడిగా ప్రజల్లోకి రావడం.. ఏదోకటి ఊగిపోతూ మాట్లాడటం ఆయనకు అలవాటు అయిపోయిందంటూ పేర్ని పవన్ కు చురకలంటించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పై బురద చల్లడమే పవన్ ముఖ్య అజెండా అంటూ ఆయన విమర్శించారు.

టీడీపీ ఇన్‌ ఛార్జీలను పెట్టిన ప్రాంతాల్లో జనసేన పొరపాటున కూడా ఇన్‌ చార్జీలను ఏర్పాటు చేయదని ఆయన అన్నారు. పవన్ కిరాయి తీసుకుంటున్నారు కాబట్టి..ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసి వెళ్లిపోతాడంటూ చురకలంటించారు.

పవన్‌ పని చేసేదే చంద్రబాబు కోసంమని ఎద్దేవా చేశారు. జగన్‌ పై విపరీతమైన ద్వేషంతోనే వారిద్దరూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ను కేంద్రం తో చెప్పి ఆటాడించే సత్తా ఉన్నోడివైతే..అంతా సత్తానే ఉంటే వైజాగ్‌ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవని నిలదీశారు.

జగన్‌ ని, వైసీపీ మంత్రులు గురించి తరువాత ఆలోచిద్దువు కానీ..ముందు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి అంటూ పేర్ని నాని అన్నారు.
వైసీపీ నుంచి ఎవ్వరినీ కూడా జనసేనలోనికి రానివ్వను అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు పార్టీలోకి ఎవర్ని పడితే వారిని రానిస్తున్నాడు. మాట మీద నిలకడ లేని మనిషి అంటూ విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు