ఇప్పుడు పశువుల డాక్టర్‌ అయితే..అప్పుడు దేవతలా డాక్టరా?

టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

AP News: చంద్రబాబు దోస్తులంతా దొంగలే.. డ్రగ్స్ వ్యవహారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు!
New Update

నారా లోకేష్‌ గన్నవరం వేదికగా వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీల మీద విరుచుకుపడ్డారు. ఈ విషయం గురించి వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే లోకేష్‌ గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు.

టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుకి తన కొడుకుని పెంచడం చేత కాలేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే పెద్ద మనిషి కొడుకు సంస్కారహీనంగా పెరిగాడని పేర్కొన్నారు. లోకేష్‌ నిర్వహిస్తున్న యాత్ర పేరు యువ గళం కాదు..యువగంగాళం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి టీడీపీ వాళ్లు చెబుతున్నారని అన్ఆనరు.

ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో..ఏమి ఇస్తామో చెప్పకుండా నేను మూర్ఖుణ్ణి..నా త్రండి మంచోడ్ని అని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ని జైలులో పెడితే ఆయన మౌనంగా బాధను భరించారు కానీ..సోనియాని జైల్లో పెడతా..బాబుని జైల్లో పెడతా అని చెప్పలేదన్నారు.

జగన్ ప్రజలకు ఏమి చేస్తాను అనేది ఎన్నికల సమయంలో వివరించారు.అదే అధికారంలోకి రాగానే చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు గన్నవరం ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్ అంటున్నారు. ఆయన మీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చారు. మరి ఆ సమయంలో ఆయనేమన్నా మనుషుల డాక్టర్‌..దేవతలా డాక్టర్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.

కొడాలి నాని కూడా టీడీపీలో ఉన్న సమయంలో ఏమైనా ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారా అని ప్రశ్నిచారు, ఆయన ఒక మంత్రిగా చేశారు.ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.అలాంటి వ్యక్తిని పట్టుకుని లారీ క్లీనర్..కప్పులు కడిగేవాడు అని పేర్కొవడం ఏమి బాగాలేదు అని ఆయన అన్నారు.

తండ్రీ కొడుకులకు ఆవగింజంత సిగ్గు, దోస గింజంత ఆత్మాభిమానం ఉంటే గుడివాడలో మీకు అభ్యర్ధి ఎవరో చెప్పాలని పేర్ని నిలదీశారు. బట్టలూడదీసి చూసే అలవాటు ఏమిటన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపులో ఉన్న కిరాణా సరుకులు అమ్ముకోవడం కోసం రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, చంద్రన్న కానుక పథకాలు పెట్టారని అన్నారు.

#perni-nani #vamsi #tdp #ycp #kodali-nani #naralokesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి