Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు జ్వరం.. హైదరాబాద్‌కు బయలుదేరిన జనసేనాని

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో హుటాహుటీనా హైదరాబాద్‌కు బయలుదేరారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మళ్లీ రేపు ఉదయం పవన్ పిఠాపురం చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
Pawan kalyan: కాబోయే ప్రధాని ఆయనే.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Pawan Kalyan Suffering From Fever: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రెండు రోజులగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హుటాహుటీనా హైదరాబాద్‌కు బయలుదేరారు. నిన్న, ఈరోజు పవన్‌.. పిఠాపురంలో ఉన్నారు. ఈరోజు ఉదయమే ఆయన శ్రీపాద వల్లభుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ, బీజేపీ నాయకులతో హోటల్‌లో సమావేశమయ్యారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌ ద్వారా రాజమండ్రికి చేరుకున్నారు.

Also Read: ఎకరాకు రూ.25 వేలు పరిహారమివ్వాలి

ఆ తర్వాత రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లనున్నారు. అలాగే రేపు ఉదయం మళ్లీ పీఠాపురం వచ్చేందుకు పవన్.. ప్రత్యేక విమానం బుక్‌ చేసుకున్నారు. రేపు, ఎల్లుండి మళ్లీ నియోజకవర్గ ప్రచారంలో పవన్ పాల్గొంటారని.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.

Also Read: గులాబీ బాస్ మాట్లాడుతుంటే పవర్ కట్..కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కేసీఆర్.!

Advertisment
తాజా కథనాలు