Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం! పారిస్ పారాలింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. By srinivas 02 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి India : పారిస్ (Paris) పారాలింపిక్స్ (Paralympics) లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే 8 పతాకాలు భారత్ ఖాతాలో చేరగా.. సోమవారం భారత్ రెండో స్వర్ణం సొంతంచేసుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ (Nitesh Kumar) స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. ఇప్పటికే షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. కాగా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 ఈవెంట్లో యోగేశ్ కథునియా సోమవారం రజతం కైవసం చేసుకున్నాడు. Also Read : వరదల్లో బోట్ల దందా.. రూ.1500 నుంచి 4 వేలు వసూలు #paralympics-2024 #nitesh-kumar #2024-paris-olympics #gold-medal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి