Paris Olympics: వెరైటీగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..నదిలో పరేడ్

పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా, చరిత్రకు విరుద్ధంగా ఈసారి స్టేడియం లోపల కాకుండా ఈ వేడుకలను బయట నిర్వహిస్తున్నారు. సీన్ నది ఒడ్డున ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.

New Update
Paris Olympics: వెరైటీగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..నదిలో పరేడ్

Opening cermony: పారిస్ ఒలింపిక్స్...ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఈ విశ్వ ఆటల పోటీలు ఈరోజే మొదలవనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల క్రీడాకారులు పారిస్‌కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 7.30గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను గ్రాండ్‌గా చేయడానికి ఏర్పాట్లు చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అయితే ఈసారి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ ఎప్పటిలా స్టేడియం లోపల కాకుండా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో నిర్వహించున్నారు.

ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో క్రీడాకారులు పరేడ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం బోట్ల మీద చేయనున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ చేయనున్నారు. సీన్‌ నదిలోని ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్‌లను దాటుకుంటూ.. సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ల బోట్ పరేడ్ కొనసాగనుంది. ఈ వేడుకలను 6 లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించేలా ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన దేశంలోని స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ ద్వారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీని లైవ్‌లో చూడొచ్చు. అలాగే జియో సినిమా యాప్, వెబ్ సైట్ల ద్వారానూ లైవ్‌లో చూడొచ్చు.

Also Read:Mumbai: ముంబయ్‌కు రెడ్ అలర్ట్..దంచికొడుతున్న వర్షాలు

Advertisment
తాజా కథనాలు