Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్!

భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్‌ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్‌ ఖాతాలో మరో పతకం చేరనుంది.

New Update
Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్!

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది. మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్‌ ఒక్సానాపై (Oksana Livach) 7-5 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

అంతకుముందు మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సుసాకీని వినేశ్ ఫోగట్ ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆమెను 3-2 తేడాతో ఓడించింది. ఇక వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు మరో పతకం లభించనుండగా.. మంగళవారం రాత్రి సెమీ ఫైనల్‌లో గబిజా డిలైట్ లేదా యుస్నీలిస్ లోపెజ్‌తో వినేశ్ ఫోగట్ తలపడుతుంది.

Advertisment
తాజా కథనాలు