/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mahesh-2.jpg)
Mahesh Babu: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్..బంగారు పతకం తీసుకుని వస్తుందని కోట్లాది మంది భారతీయులు ఎదురు చూసారు. కానీ ఫైనల్ కు ముందు ఆమె పై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు గుర్తించిన ఒలింపిక్ నిర్వాహకులు..ఆమె పై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వినేష్కు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మద్దుతుగా నిలుస్తున్నారు.
Today’s outcome doesn't matter, but your greatness in how you coped with the decision does 👏👏👏#VineshPhogat, you’ve shown everyone that your heart is that of a true champion; your resilience and strength to stand tall in difficult times inspires us all.
Medal or not, your…
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2024
ఇప్పటికే వినేశ్కి బాలీవుడ్ నుంచి కరీనా కపూర్ ఖాన్, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, సమంత రుతుప్రభు, తాప్సీ పన్ను, ఫాతిమా సనాషేక్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండే.. వంటి వారు ధైర్యం చెప్పారు. మీరు నిజమైన ఛాంపియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు కూడా వినేశ్కు అండగా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని పేర్కొన్నారు. 1.4 బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయని పేర్కొన్నారు.
‘నేటి ఫలితంతో సంబంధం లేదు. కానీ మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయం మాత్రం...కచ్చితంగా మీ గొప్పతనమే. వినేశ్ .. మీరొక నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో మీ ధైర్యం, బలం ప్రతిఒక్కరికి స్ఫూర్తి. పతకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు. మీ స్ఫూర్తి మాలోని ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి’ అని మహేశ్ బాబు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
Also read: వినేశ్ ను పతక విజేతగానే స్వాగతించి సత్కరిస్తాం..హర్యానా ప్రభుత్వం!