పాకిస్తాన్ లో 6 రోజుల పాటు సోషల్ మీడియాపై నిషేధం!

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు 'యూట్యూబ్, వాట్సాప్' సహా సోషల్ మీడియాపై నిషేధం విధించనుంది.పాకిస్థాన్‌లో 17న ముహర్రం అషురా జరుపుకుంటారు. దీనికి సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది.

పాకిస్తాన్ లో 6 రోజుల పాటు సోషల్ మీడియాపై నిషేధం!
New Update

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు 'యూట్యూబ్, వాట్సాప్' సహా సోషల్ మీడియాపై నిషేధం విధించింది.పాకిస్థాన్‌లో 17న ముహర్రం అషురా జరుపుకుంటారు. దీనికి సంబంధించి పంజాబ్ ప్రావిన్స్‌లో 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సోషల్ మీడియాపై నిషేధం విధించారు.పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది.

దీనికి సంబంధించి దేశంలోని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందు ఒక సిఫార్సును జారీ చేసింది.హింసను నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నారు. "దీని ద్వారా, ద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు  సమాచారాన్ని పంచుకోవడం నిరోధించనుందని  పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ఫలితాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల ఆధారంగా ఆ దేశ ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ 'X' పేజీని నిషేధించింది.

#bans #social-media #pakistan #6-days
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe