Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్‌ గేట్లు

నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని  దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది.

New Update
Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్‌ గేట్లు

Nagarjuna Sagar Dam Gates: నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని  దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీల కాగా.. 271.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Also Read: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు !

ప్రస్తుతం సాగర్ జలాశయానికి 3 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 37,873 క్యూసెక్కులు ఔట్‌ ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద రావడంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. సాగర్ దిగువన ఉన్న కృష్ణానది పరిసర ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Also Read: భారీ వరదలు.. 11 మంది మృతి, 40 మంది గల్లంతు

Advertisment
తాజా కథనాలు