Telangana: శంషాబాద్లో ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. మహిళ అరెస్టు విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను శంషాబాద్లో ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. 5.92 కిలోల హెరాయిన్ తరలించే ప్రయత్నం చేసిందని అధికారులు తెలిపారు. వాటి విలువ 41.4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. By B Aravind 21 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి విదేశాల నుంచి మనదేశానికి అక్రమంగా డ్రగ్స్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లలో దొరికిపోవడం సర్వసాధారణమైపోయింది. అధికారులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా.. ఎన్నిసార్లు నిందితులను అరెస్టు చేసినా కూడా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటకర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. అయితే ఈసారి అధికారులను షాక్ గురి చేసింది ఓ మహిళ. Also Read: కేసీఆర్ పని అయిపోయిందని.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు రూ.41.4 కోట్లు విదేశాల నుంచి ఆమె 5.92 కిలోల హెరాయిన్ను తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఎప్పట్లాగే భద్రతా సిబ్బంది గుర్తుపట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హెరాయిన్ విలువ రూ.41.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ మహిళా జాంబియా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆమెను తనిఖీ చేయడంతో డ్రగ్స్ బయటపడినట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయాలా ప్రస్తుతం ఆ సౌతాఫ్రికా మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇదిలాఉండగా.. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎవ్వరికి ఇవ్వాలనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పట్టుబట్ట మహిళతో ఎవరికైనా పరిచయాలున్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు. Also Read: హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు #telugu-news #drugs #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి