నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!

ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!

ఒడిశాలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్య బిడ్డ పట్ల మానవత్వం మరిచిపోయి ప్రవర్తించాడు. ఇంట్లో నిద్రిస్తున్న వారి వద్దకు పామును విడిచిపెట్టి వారిని చాలా తెలివిగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గంజాం జిల్లాలోని కబి సూర్య నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అధీగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేశ్ పాత్రాకు బసంతి పాత్ర తో 3 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి దేబాస్మిత అనే రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే భార్య భర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే వారిని ఎలాగైనా చంపేయాలని భావించాడు.

అందుకు గానూ పక్క ప్రణాళికలు రూపొందించాడు. ఇందుకోసం ఎవరికీ అనుమానం రాకుండా వారిని చంపేందుకు పామును ఆయుధంగా ఉపయోగించాడు. పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి అత్యంత విషపూరితమైన పామును తీసుకుని దానిని ఎలాగోలా ఇంటికి తీసుకుని వచ్చాడు.

రాత్రి సమయంలో భార్య , కూతురు పడుకున్న గదిలోనికి పామును విడిచిపెట్టాడు. ఆ తరువాత అతను వేరే గదిలో నిద్రించాడు. తెల్లారి చూసేసరికి భార్య కూతురు నురుగలు కక్కుకుని చనిపోయి ఉన్నారు. అయితే ఈ మరణాలు గురించి బసంతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

సుమారు నెలన్నర తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గణేశ్‌ని అనుమానించిన పోలీసులు అతనిని విచారించగా ముందు నిందితుడు నిజాలు ఒప్పుకోలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే పాముకాటు బాధితుల కోసం రూ. 8 లక్షల ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని - ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఇస్తారనే ప్రలోభాలు అతన్ని ఈ ప్రణాళికను రూపొందించడానికి దారితీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also read: ఫేక్‌ వీడియోలు వైరల్ కావచ్చు..కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి..కేటీఆర్ పిలుపు!

Advertisment
తాజా కథనాలు