నిజామాబాద్ ( Nizamabad) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమించిన (love matters) వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ప్రాణాలు చేసుకుంది. మోసం చేయడంతో పాటు వేధింపులు కూడా తట్టుకోలేక పోతున్నానని బాలిక సూసైడ్ నోట్లో రాసి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో జిల్లా కేంద్రంలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అంతేకాకుండా బాలిక రాసిన లేఖను చూసి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కూడా షాక్కు గురి అయ్యారు. అర్సపల్లిలో పదోవ తరగతి చదువుతున్న బాలిక..శనివారం రోజు (నిన్న) ఆమె తల్లి కూరగాయల మార్కెట్కు రమ్మని పిలిచింది. దీంతో నాకు కళ్లకలక వచ్చింది.. ఇంట్లోనే ఉంటానని అమ్మతో చెప్పింది. తల్లి పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బాలిక చున్నీతో ఉరివేసుకొని దూలానికి వేలాడుతోంది. స్థానికుల సహాయంతో కిందకి దించింది తల్లి. అప్పటికే బాలిక మరణించింది. ప్రేమ విఫలం కావడంతో నా కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Nizamabad: ప్రాణం తీసిన మైనర్ ప్రేమ..సూసైడ్ నోట్లో ఫోన్ నెంబర్
ప్రేమ వ్యవహారం ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. అన్నా.. వాడి టార్చర్ పెరిగిపోయింది..వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నా..! అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో..? అంటూ ఓ బాలిక సూసైడ్ నోట్ అందరిని కంటతడి పెట్టిస్తోంది.
Translate this News: