Nitin Gadkari: పంజాబ్‌ ముఖ్యమంత్రికి నితిన్‌ గడ్కరీ లేఖ

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. జలంధర్‌, లుధియానాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

New Update
Nitin Gadkari: పంజాబ్‌ ముఖ్యమంత్రికి నితిన్‌ గడ్కరీ లేఖ

Nitin Gadkari: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు (Bhagwant Mann) కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. జలంధర్‌ (Jalandhar), లుధియానాల్లో (Ludhiana) ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితులు మెరుగుపడకపోతే.. రాష్ట్రంలో రూ.14,288 కోట్ల వ్యయంతో చేపడుతోన్న 293 కి.మీ మేర రహదారుల ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

Also Read: కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా రూ. 78 వేలు.. ఈ స్కీమ్ గురించి తెలుసా?

Advertisment
తాజా కథనాలు