Nithya Menen క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి సరసన నిత్యామీనన్!

మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తాజాగా కోలీవుడ్ లో అదిరిపోయే ఆఫర్ అందుకుంది. పాండిరాజ్‌ - విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అంటున్నారు.

Nithya Menen క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి సరసన నిత్యామీనన్!
New Update

Nithya Menen To Play Female Lead Role In Vijay Sethupathi's Film : గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైన నిత్యామీనన్ ప్రస్తుతం తమిళ్,మలయాళ భాషల్లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. 2022 లో ధనుష్ తో కలిసి 'తిరు' సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్ లో మరో అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.విజయ్‌ సేతుపతి రీసెంట్ గా 'మహారాజ' చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Also Read : రిలీజైన 15 నెలలకు ఓటీటీలోకి వస్తున్న’ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సేతుపతి కెరీర్ లో 50 వ సినిమాగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు ప్రశంసలు సైతం లభించాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాను పాండిరాజ్‌ దర్శకత్వంలో చేసేందుకు సేతుపతి సన్నద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. అంతేకాదు సినిమాలో నిత్యామీనన్‌ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

#nithya-menen #vijay-sethupathi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe