చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థ కార్యాలయాలు, ఉద్యోగులు, జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లతో పెద్దెత్తున ఈ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఆధారాల సేకరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. హార్డ్ డిస్క్ డేటాను కూడా పోలీసులు తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మరింత ముందుకు వెళ్ళారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను అరెస్ట్ చేశారు. చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడానికి ప్రబీర్ నిధులు అందుకున్నారని ఆరోపణలు రావడంతో ఉప చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూస్ క్లిక్ కు వచ్చే విదేశీ నిధుల దర్యాప్తు ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..news click: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్
చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని, వారికి నిధులు అందాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై ఢిల్లీ పోలీసులు మరో కొత్త కేసు నమోదు చేశారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: