ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మొరంచపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లలేకపోవడంతో ముందుగా మొరంచపల్లికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ (ndrf) బృందాలు హెలికాఫ్టర్ల (Helicopters)సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం భారీ వర్షం కురవడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండిపోయారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు తమను కాపాడాలని అధికారులను వేడుకున్నారు.
పూర్తిగా చదవండి..ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
Translate this News: