Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!

ప్రకృతి విపత్తులతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత? మానవ తప్పిదాలేవో ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!

Cloudbursts India:  భారతదేశం ఇటీవల కాలంలో ప్రకృతి వైపరిత్యాలతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. అయితే వరుసగా సంభవిస్తున్న విపత్తులకు కారణం వాతవరణంలో మార్పులు, మనుషులు చేసే ప్రకృతి విధ్వంసంగానే తెలుస్తుండగా.. క్లౌడ్ బస్టర్ వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదనలు లేకపోలేదు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో జనజీవనం ఉండే లద్దాఖ్, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌లో క్లౌడ్ బస్టర్ కారణంగానే మేఘాలు పేలడం, రహాదారులపై కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ప్రాణాలు కొల్పోయినట్లు వాదనలున్నాయి. మరోవైపు తాజాగా కేరళలోని వయనాడ్ లో భీకర ప్రళయానికి క్లౌడ్ బస్టర్ కారణమా? ఇంతకు క్లౌడ్ బస్టర్ అంటే ఏమిటి? అది ఏ ప్రాంతాల్లో, ఎప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల దెబ్బ తిన్న ప్రాంతాలేవో తెలుసుకుందాం.

100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే..
ఈ మేరకు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్‌ అంటారు. పర్వత ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలకు నీటిని మోసుకుపోయిన మేఘాలు.. సంతృప్త స్థాయికి చేరడం వల్ల వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ అక్కడి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షించడం మేఘాలకు సాధ్యం కాదు. వర్షపు చినుకులు కిందకు పడే బదులు.. వేడి వాతావరణం వల్ల పైకి కదులుతాయి. దీంతో కొత్త వర్షపు బిందువులు ఏర్పడటంతోపాటు.. అప్పటికే ఉన్న వర్షపు చుక్కల పరిమాణం పెరుగుతుంది. కొంత సమయం తర్వాత వర్షపు బిందువులను మోయలేని స్థితికి మేఘాలు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి.

అమర్‌నాథ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్..
ఇక 2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం. ఆ సమయంలో అక్కడ భారీ స్థాయిలో మేఘాలు ఏర్పడగా.. వాటి సాంద్రత కూడా అంతే వేగంగా పెరిగిపోయింది. దీని వల్లే క్లౌడ్ బరస్ట్ సంభవించి ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత ఏడాది దాదాపు ఇదే సమయంలో అమర్‌నాథ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఒకేసారి భారీ వర్షం కురవటం వల్ల వరదలు సంభవిస్తాయి. ఒకే చోట భారీ స్థాయిలో పడే వర్షాలు ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటాయి. ఇటీవల జూలై 8న జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో.. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో 16 మంది చనిపోగా 20 మందికిపైగా గాయపడ్డారు. కానీ వాస్తవానికి అది క్లౌడ్ బరస్ట్ కాదు. అమర్‌నాథ్ ప్రాంతంలో జూలై 8వ తేదీ సాయత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య 31 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

ఇది కూడా చదవండి: Paris Olympics: ఇద్దరు ఒకేలా.. క్రీడా లోకాన్ని అబ్బురపరిచిన చైనీస్ ద్వయం: వీడియో వైరల్

అలాగే గత రెండు రోజులగా ఉత్తరాఖండ్‌లో 23 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 15 మంది, జంట హిమాలయ రాష్ట్రాల్లో 8 మంది క్లౌడ్‌బరస్ట్ వల్లే మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌లు ముమ్మరం చేశాయి. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల కీలక రహదారులు మూసివేయబడ్డాయి. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం క్లౌడ్‌బరస్ట్ ల తర్వాత కొండచరియలు విరిగిపడటం,శిధిలాల కారణంగా తెగిపోయిన ప్రాంతాలకు చేరుకోవడానికి రక్షకులు డ్రోన్‌లను పంపించారు. భారత వైమానిక దళం (IAF) కేదార్‌నాథ్‌కు వెళ్లే ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయిన 800 మంది యాత్రికులను తరలించడానికి చినూక్, MI17 హెలికాప్టర్‌లను మోహరించింది. వాతావరణం అనుకూలిస్తే ఈరోజు యాత్రికులను తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

36 గంటల్లో మూడు జిల్లాల్లో 103 ఇళ్లు ద్వంసం..
క్లౌడ్‌బరస్ట్ కారణంగా కులు, మండి పదార్, సిమ్లాలోని రాంపూర్ సబ్‌డివిజన్‌లోని నిర్మాండ్, సైంజ్, మలానా ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. క్లౌడ్‌ బరస్ట్ కారణంగా తప్పిపోయిన 45 మందిని కనుగొనడానికి రక్షకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం గత 36 గంటల్లో మూడు జిల్లాల్లో 103 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో 32 ఫుట్‌బ్రిడ్జిలు, దుకాణాలు, పాఠశాలలు మూసివేయబడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు బాధితులకు తక్షణ సహాయంగా రూ. 50,000 ప్రకటించారు. గ్యాస్, ఆహారం ఇతర నిత్యావసర వస్తువులతో పాటు వచ్చే మూడు నెలల అద్దెకు నెలకు రూ. 5,000 ఇవ్వనున్నట్లు చెప్పారు.మండి - పండోహ్ మధ్య మూడు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారిని గత రాత్రి నుండి మూడు చోట్ల మూసివేశారు. రహదారి దిగ్బంధనం కారణంగా హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. చిన్న వాహనాలు కటౌలా - గోహర్ మీదుగా ప్రత్యామ్నాయ రహదారికి దారి మళ్లించబడ్డాయి. జాతీయ రహదారి 5 (రాంపూర్-కిన్నూర్) నిగుల్సరి వద్ద కూడా బ్లాక్ చేయబడింది. లుహారి-బంజార్, కులును కలిపే జాతీయ రహదారి 305 కూడా కొండచరియలు విరిగిపడటంతో బ్లాక్ చేయబడింది.

జూలై 31 నుంచి ఉత్తర భారతదేశంలో ఒక జాతీయ రహదారితో సహా 300 రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. 191 రోడ్లు పెండింగ్‌లో ఉన్నందున బ్లాక్ చేయబడిన మార్గాలను క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 340 JCBలు, పోక్‌ల్యాండ్ యంత్రాలతో కూడిన భారీ ఆపరేషన్‌ని ప్రారంభించారు. మేఘాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 712 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో 146 ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా, 14 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చమోలి, బాగేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షపాతంతోపాటు నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు