భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు. పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.
ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్... ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్. కాగా జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని బైసరన్లో మంగళవారం జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో కనీసం 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E
— ANI (@ANI) April 23, 2025
#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "We lost many innocent lives in the cowardly act in Pahalgam. We are deeply distressed. I express my condolences to the families who lost their loved ones... I want to repeat India's resolve against… pic.twitter.com/OhuX8rkghy
— ANI (@ANI) April 23, 2025
వారిని వదిలిపెట్టం : మోదీ
ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు, బాధితులకు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ దారుణమైన చర్య వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టి, వారిని వదిలిపెట్టబోమని అన్నారు. సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని, ప్రధాని మోదీ బుధవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చారు. మరోవైపు ఉగ్రవాద దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రవాద దాడిని సుప్రీంకోర్టు అధికారికంగా ఖండిస్తూ, ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.