54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా

అమెరికాకు అక్రమ రవాణా మార్గం ద్వారా వెళ్లిన 54 మంది భారతీయులను తిరిగి పంపించారు. ఆదివారం సాయంత్రం వారంతా OAE-4767 విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ 54 మంది కూడా హర్యానా రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారు.

New Update
US Deports

అమెరికాకు అక్రమ రవాణా మార్గం ద్వారా వెళ్లిన 54 మంది భారతీయులను తిరిగి పంపించారు. ఆదివారం సాయంత్రం వారంతా OAE-4767 విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ 54 మంది కూడా హర్యానా రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారు. వీరందరినీ అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపగా, ఈ సంఘటన వెనుక ఉన్న మానవ అక్రమ రవాణా మార్గం 'డాంకీ రూట్' పై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేశాయి.

అమెరికాలో మెరుగైన జీవితం కోసం ఆశపడిన ఈ యువకులను మోసగించి, దళారులు అత్యంత ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 'డాంకీ రూట్' అని పిలిచే ఈ అక్రమ ప్రయాణంలో, వలసదారులు అనేక దేశాల సరిహద్దులను దాటుతూ, దట్టమైన అడవులు, పర్వతాలు, జలమార్గాల గుండా ప్రమాదకరమైన మార్గాల్లో నడవాల్సి వస్తుంది.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ED, ఈ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న ట్రావెల్ ఏజెంట్లు, మధ్యవర్తుల ఇళ్లు, కార్యాలయాలపై పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బును గుర్తించేందుకు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

దళారులు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసి, సరైన వీసాలు, చట్టపరమైన మార్గాల ద్వారా పంపిస్తామని హామీ ఇచ్చి, చివరకు వీరిని మోసగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బహిష్కరించబడిన కొంతమంది యువకుల వాంగ్మూలాల ప్రకారం, వారు గయానా, బ్రెజిల్, పెరూ, పనామా, మెక్సికో వంటి దాదాపు 10కి పైగా దేశాల ద్వారా ప్రయాణించి, చివరికి అమెరికా సరిహద్దుల్లో పట్టుబడ్డారు.

Advertisment
తాజా కథనాలు