IND PAK WAR 2025 : భారత, పాకిస్థాన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన చర్యలను కొనసాగిస్తూనే ఉంది. భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్స్, మిస్సైల్స్తో దాడులు చేస్తోంది. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 40--50 డ్రోన్లతో దాడులు చేసింది. వాటన్నింటిని భారత్ కూల్చివేసింది. అయినప్పటికీ ఇంకా డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. ఈ క్రమంలో అమృత్సర్ లో ఎయిర్ రైడ్ సైరన్ మళ్లీ మోగింది. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి మరిన్ని దాడులు తప్పవన్న ఉద్దేశంతో సైరన్ మోగడంతో భారత్ సైన్యం అప్రమత్తమైంది. పాక్ నుంచి ఎటు వంటి డ్రోన్లు, మిస్సైల్స్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. పాక్ నుంచి ఎదురయ్యే సమస్యలను గుర్తించి ముందుగానే ఎయిర్ రైడ్ సైరన్ మోగే విధానాన్ని భారత్ సైన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాక్ డ్రోన్లను చాలా ఈజీగా అడ్డుకునేందుకు అవకాశం ఏర్పడింది.
పాకిస్థాన్లో దీపావళి....అజిత్ దోవల్ సంచలన వీడియో వైరల్
భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్లో రెండు రోజులుగా భారత్ ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా భారత్ భూభాగంపై దాడులు చేస్తోంది. దాన్ని భారత్ తిప్పికొడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత నావికాదళం కూడా రంగంలోకి దిగింది. పాకిస్థాన్లోని ప్రధాన నగరమైన కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'పాకిస్తాన్లో దీపావళి' అంటూ ఆయన సైటర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన నెటిజన్లు 'ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందుంది ముసళ్ల పండుగ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Diwali in Pakistan 🔥 pic.twitter.com/JFYU3n1xvc
— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 8, 2025